September 5, 2014

days list history


Thursday, October 7, 2010

World Deaf Day , ప్రపంచ వినికిడి మెరుగు పరిచే దినోత్సవం




వరల్డ్ డెఫ్ డే -- సెప్టెంబర్ 23 న .

సమాజము లో చెవిటి వారు అంటే చిన్నచూపు , హేలన చేసే బావన ఉన్న ఈ రోజొల్లో వినికిడి విజ్ఞానము అభివృద్ధి చెంది వారికీ సమాజములో సమాన హోదా , గౌరవ , మర్యాదలు పొందుతున్నారు . చాలామంది చదువు కుంటున్నారు , ఉద్యోగాలు చేసుకుంటున్నారు . ప్రపంచవ్యాప్తము వారికీ ఒక సంఘం ఉండాలన్న ఉద్దేశము తో ..........
ఇటలీలోని రోమ్‌ లో వరల్డ్ డెఫ్ డే కి 1951 లో రూపకల్పన చేశారు . ఇది అంతర్జాతీయ ప్రభుత్వేతర సెంట్రల్ ఆర్గనైజేషన్‌ . వినికిడి లేనివారి జాతీయ అసోసియేషన్‌ లతో కూడి ఉన్నది . ప్రపంచవ్యాప్తం గా ఈ సంస్థలో 130 దేశాలు సభ్యత్వం కలిగివున్నాయి . జాతి , దేశము , మతము , లింగ వివక్ష , ఇతత ప్రాధాన్యాలు , భేదాలు లేకుండా ప్రజలందరికీ సమానత్వము , మానవ హక్కులు , గౌరవమర్యాదలు ఒకేమాదిరి ఉండాలన్నది ఈ వరల్డ్ డెఫ్ డే సిద్ధాంతము . దీనిని ఏటా సెప్టెంబర్ 23 న నిర్వహిస్తున్నారు .
సౌంజ్ఞల భాషను ఉపయోగించే వినికిడి లేనివారిపై , వారి కుటుంబము , మిత్రులుపై దృస్తి సారిస్తూ మానవహక్కులపై ఏర్పాటుచేసిన అనేక ఐక్యరాజ్యసమితి సదస్సులకు W.F.D. మద్దతు ఇచ్చినది . ఇది ఐక్యరాజ్యసమితి వ్యవస్థలో కన్స్ల్టేటివ్ స్థాయి కలిగిఉంది . ఇంకా అనేక అనుబంధ సంస్థలతో బాంధవ్యాలు కలిగిఉంది . ఇంటర్నేషనల్ డిజెబిలిటీ అలయెన్స్ (IDA) లో డబ్ల్యు.ఎఫ్.డి.కి సభ్యత్వం ఉన్నది . సైన్‌ లాంగ్వేజెస్ స్థాయిని మెరుగుపరచడం , విన్లేనివారికి ఉత్తమ విద్య , సమాచారము , ఇతర సేవల్ని మెరుగుపరచడం , వర్దమాన దేశాల్లో వినికిడిశక్తి లేని వారి మానవహక్కుల్ని మెరుగుపరచడం , ప్రస్తుతం లేని ప్రాంతాలలో డెఫ్ ఆర్గనైజేషన్లు నెలకొల్పడాన్ని ప్రోత్సహించడం దీని ప్రధాన ఉద్దేశాలు .
డబ్ల్యు.ఎఫ్.డి . నిర్ణయాలు తీసుకునే విభాగము... జనరల్ అసెంబ్లీ ప్రతి నాలుగేళ్ళకు ఒకసారి జరిగే జనరల్ అసెంబ్లీకి ఇద్దరు వినికిడి లోపము గల ప్రతినిధులను పంపేహక్కు ప్రతి సాధారణ సభ్యదేశానికీ ఉంటుంది . W.F.D కి యునైటెడ్ నేషన్స్ లో బి-కేటగిరి స్టేటస్ ఉంది . ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ (E.N.C) రీజినల్ కమీషన్లు అయిన ఎకనామిక్ కమీషన్‌ ఫర్ ఆఫ్రికా (ఇసిఎ), ఎకనామిక్ కమీషన్‌ ఫర్ యూరఫ్ (ఇసిఇ ), ఎకనామిక్ కమీషన్‌ ఫర్ ల్యాటిన్‌ అమెఇకా అండ్ ది కరిబియన్‌ (ఇసిఎల్ ఎసి ) , ఎకనామిక్ అండ్ సోషల్ కమీషన్‌ ఫర్ వెస్టరన్‌ ఏసియా(ఎ ఎస్ సి డబ్ల్యూఎ ) , యునెస్కో , ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్‌ , వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌ , వరల్డ్ బ్యాంక్ , కౌన్సిల్ అఫ్ యూరఫ్ం ల వంటి గ్రూపులకు డబ్ల్యు .ఎఫ్.డి ప్రాతినిధ్యము వహిస్తోంది . సలహాలు సూచనలు ఇస్తూఉంటాయి .
ఇండియాలో సుమారు 60 మిలియన్లు చెవిటివారు ఉన్నారు . పురుషులకు స్త్రీలకు వేర్వేలు ఆర్గనైజేషన్లు ఉన్నాయి . ఉదా. Delhi foundation of Deaf women , Madras foundation of Deaf Women . సెప్టెంబర్ 26 న " డే ఒఫ్ ది డెఫ్ " ఇండియాలో జరుపుకుంటారు .
చెవిటి వారికి ఆటలకు ఎమీతక్కువలేదు . ఎన్నో స్పోర్ట్స్ అసోషియేషన్లు ఉన్నాయి . ఉదా: " All India sports council of thd Deaf " , All India Cricket association of the Deaf" , "Delhi sports council for the Deaf" . మున్నగునవి .
ఎన్నో చెవిటి , మూగ స్కూల్స్ ఉన్నా్యి. మూగవారికి ప్రత్యేక సైన్‌ లాంగ్వేజ్ ఉన్నది .

2001 జనాభా లెక్కలు ప్రకారం, ఇండియాలో 2.19 కోట్ల మంది వికలాంగులు ఉన్నారు. వారు మొత్తం జనాభాలో 2.13% ఉన్నారు. వీరిలో కంటికి, వినికిడికి, మాట, లోకోమోటారు మరియు మానసిక సంబంధమైన వైకలాల్ని కలిగి ఉన్నారు.

గ్రామీణ ప్రాంతాలలో 75% మంది వికలాంగులు ఉన్నారు, వికలాంగులలో 49 % అక్షరాస్యులు ఉన్నారు మరియు 34% మాత్రమే పనిచేస్తున్నారు. ఇంతకుముందు వైద్య పునరావాసానికి ప్రాముఖ్యత నిచ్చేవారు, మరి ఇప్పుడు సామాజిక పునరావాసానికి ప్రాముఖ్యతనిస్తున్నారు.


జనాభా లెక్కలు, ఇండియా 2001 ప్రకారం, వికలాంగుల డేటా

కదలిక 28%
చూపు 49%
వినికిడి 6%
మాట 7%
మానసిక 10%
ఉత్పాదక స్థానం: 2001 జనాభా లెక్కలు, ఇండియా

జాతీయ మోతాదు సర్వే సంస్థ (ఎన్ ఎస్ ఎస్ ఒ) 2002 ప్రకారం వికలాంగుల డేటా
కదలిక 51%
చూపు 14%
వినికిడి 15%
మాట 10%
మానసిక 10%
ఉత్పాదక స్థానం: జాతీయ మోతాదు సర్వే సంస్థ, 2002


ప్రభుత్వ పథకాలు

కొనుగోలు / ఫిట్టింగులలో సహాయోపకారణాలు మరియు ఉపకరణాలను వికలాంగులకు కల్పించ డానికి సహాయం ( ఎ డి ఐ పి పథకం ) వైకలాంగిక ప్రభావాన్ని తగ్గించి మరియు ఆర్థిక స్తోమతని పెంచి వారి భౌతిక, సామాజిక మరియు శాస్త్రీయంగా తయారు చేసిన, నూతనమైన ప్రమాణాలు గల సహాయోపకరణాలు మరియు ఉపకరణాలు, అవసరమైన వికలాంగులకు కొనుగోలు చేయడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యము. ఈ పథకం క్రింద, సరఫరా చేసిన సహాయోపకరణాలు మరియు ఉపకరణాలపై ఐ ఎస్ ఐ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టేండర్డ్) మార్క్ ఉండాలి.

ఎ డి ఐ పి పథకం క్రింద, మొత్తం సహాయం మరియు ఆదాయ పరిమితి ఈ క్రింద ఇవ్వబడింది.

మొత్తం ఆదాయం మొత్తం సహాయం

(i) నెలకి 6500 రూపాయల వరకు (i) సహాయోపకరణాల/ ఉపకరణాల
మొత్తం ధర
(ii) నెలకి 6501 రూపాయల నుండి (ii) 50% సహాయోప కరణాల/ ఉపకరణాల
10000 రూపాయల వరకు మొత్తం ధర
స్వంచ్ఛంద సేవా సంస్థలు (ఎన్ జీ ఓ) , ఈ మంత్రిత్వశాఖ క్రింద ఉన్న జాతీయ సంస్థలు, కృత్రిమ అవయవాలు తయారు చేసే సంస్థ (ఒక భారత ప్రభుత్వ సంస్థ)ల ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.

వికలాంగులకు జాతీయ ఫింఛను పథకం :

వికలాంగులకు జాతీయ ఫింఛను పథకం క్రింద, మెట్రిక్ తరువాత ఒక సంవత్సరం కన్నా ఎక్కువ ఉండే ప్రొఫెషనల్ మరియు టెక్నికల్ కోర్సులు చదువుకోడానికి ప్రతి సంవత్సరం 500 క్రొత్త ఫింఛనులు ఇస్తారు. అయినప్పటికి, మెదడుకు సంబంధించిన పక్షవాతము, మానసిక మాంద్యము, ఒక్కటి కన్నా ఎక్కువ వైకల్యాలు మరియు అధిక లేదా త్రీవ్రమైన చెవుడు ఉన్న విద్యార్థుల విషయంలో 9 వ తరగతి నుండి చదువుకోడానికి విద్యార్థి ఫింఛన్లు ఇస్తారు. ఫింఛన్ల కొరకు ధరఖాస్తుల్ని తీసుకోనే ప్రకటనల్ని ప్రముఖ జాతీయ/ ప్రాంతీయ వార్తా పత్రికలలో జూన్ నెలలో ఇస్తారు మరియు మంత్రిత్వ శాఖ వైబ్ సైట్ లో కూడా పెడతారు. ఈ పథకానికి విస్తారమైన పబ్లిసిటీ ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వాల్ని / కేంద్రపాలిత ప్రాంతాల్ని కూడా అభ్యర్ధించడం జరిగింది.

40% లేదా అంతకన్నా ఎక్కువ వైకల్యం ఉండి, వారి నెలసరి ఆదాయం 15000 రూపాయలకన్నా ఎక్కువ లేని విద్యార్థులకి ఈ ఫింఛను తీసుకోవడానికి అర్హత కలదు. గ్రేడ్యుఏట్ మరియు పోస్టు గ్రేడ్యుఏట్ లెవెల్ టెక్నికల్, ప్రొఫెషనల్ కోర్సులు పగటిపూట చదివేవారికి నెలకి 700 రూపాయల ఫింఛను మరియు వసతి గృహాలలో చదివే విద్యార్థులకు నెలకి 1000 రూపాయల ఫింఛను ఇస్తారు. డిప్లోమో మరియు సర్టిఫికెట్ లెవెల్ ప్రొఫెషనల్ కోర్సులు పగటిపూట చదివేవారికి విద్యార్థి ఫింఛను లేదా నెలకి 400 రూపాయలు మరియు వసతి గృహాలలో చదివే విద్యార్థులకు నెలకి 700 రూపాయల ఫింఛను ఇస్తారు. ఈ ఫింఛను ఇవ్వడమే కాకుండా, సంవత్సరానికి 10,000 రూపాయల వరకూ కోర్సు ఫీజుని విద్యార్థులకు ఇస్తారు. ఈ పథకం క్రింద గ్రుడ్డి మరియు చెవిటి గ్రేడ్యుఏట్ మరియు పోస్టు గ్రేడ్యుఏట్ విద్యార్థులకి (ప్రొఫెషనల్ కోర్సు చదువు తున్న) ఎడిటింగు సాఫ్ట్ వేరుతో పాటు కంప్యూటర్ కొరకు మరియు మెదడుకి సంబంధించిన పక్ష వాతము ఉన్న విద్యార్థులకి సపోర్టు ఏక్సెస్ సాఫ్ట్ వేరు కొరకు ఆర్థిక సహాయం చేస్తారు.


జాతీయ సంస్థలు / అఖిలస్థాయి సంస్థలు

వికలాంగులకు అధికారమిచ్చే పోలసీకి అనుగుణంగా మరియు వారి పలు పరిమాణాల సమస్యల్ని ప్రభావితం చేయడానికి ఈ క్రిందనిచ్చిన జాతీయ సంస్థలు/అఖిలస్థాయి సంస్థలు ప్రతి పెద్ద వైకల్యం ఉన్న ప్రాంతంలో పెట్టారు.

* దృష్టి లోపముగల వారికి జాతీయ సంస్థ, డెహరాడూన్
* ఎముకల లోపముగల వారికి జాతీయ సంస్థ, కలకత్తా
* వినికిడి లోపముగల వారికి ఆలి యవర్ జంగ్ జాతీయ సంస్థ, ముంబాయి
* మానిసిక లోపముగల వారికి జాతీయ సంస్థ, సికింద్రాబాద్
* పూనరావాస అభ్యాసం మరియు రీసెర్చ్ జాతీయ సంస్థ, కటక్
* వికలాంగుల సంస్థ, క్రొత్త ఢిల్లీ
* ఒకటి కన్నా ఎక్కువ వైకల్యం ఉన్నవారికి అధికారం కొరకు జాతీయ సంస్థ ( ఎన్ ఐ ఇ పి ఎమ్ డి ), చెన్నై

  • ======================================
Visit My Website - > Dr.seshagirirao-MBBS

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .

 


No comments:

Post a Comment